ఉప్పల్లో టీ20 మ్యాచ్
భారత్ – వెస్టిండీస్ టీ20 మ్యాచ్కు బ్లాక్ డే నేపథ్యంలో ఉప్పల్లో జరగనున్న భారీ భద్రతా చర్యలు చేపట్టినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సుమారు 1800 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్కు అంతరాయం రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మ్యాచ్ను చూడటానికి వచ్చే వారు ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని సూచించారు. శనివారం రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. స్టేడియం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతోందని, స్టేడియం గేట్లు సాయంత్రం 4 గంటలకు ఓపెన్ అవుతాయన్నారు. ఒకసారి స్టేడియంలోకి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరని తెలిపారు. ల్యాప్టాప్, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బ్యానర్లు, సిగరెట్లు, హెల్మెట్లు, బ్యాటరీలు, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్తో పాటు ఆహార పదార్థాలను స్టేడియం లోపలికి తీసుకురాకూడదన్నారు.