ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు – కెసిఆర్
పుల్వామాలో జరిగిన దాడి అమానుషం, హేయమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు ఆయన సంతాపం తెలిపారు. ఇది మన దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ పాశవిక చర్యను తెలంగాణ అసెంబ్లీ ఖండిస్తోందంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలుపుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం 15 నిమిషాల పాటు వాయిదా పడింది.