తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
తెలంగాణలో అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల ముందు మద్యం ప్రియులకు కేసీఆర్ సర్కార్ షాకిచ్చింది. పెరిగిన ధరలకు సంబంధించిన పట్టికను ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ (డిసెంబర్ 17) పెరిగిన ధరలు (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. లైట్ బీరుపై ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.110 వసూలు చేయనున్నారు. స్ట్రాంగ్ బీర్లపై రూ.12 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఇక మద్యం ఫుల్ బాటిల్ ధర ఆయా రకాల బ్రాండ్ను బట్టి రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగాయి. సాధారణ మద్యం క్వార్టర్ బాటిల్పై రూ.20, హాఫ్ బాటిల్పై రూ.40, ఫుల్ బాటిల్పై రూ.80 అదనంగా పెరిగాయి. ఇప్పటికే నిల్వ ఉన్న మద్యానికి (ఓల్డ్ స్టాక్) పెంచిన ధరలు వర్తించవని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.