పశువులకు వింత వ్యాధి
ఎస్ఆర్పురం: చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలోని జంగాలపల్లి, మర్రిపల్లి, ఎల్లంపల్లి గ్రామాల్లో పశువులకు వింత వ్యాధి సోకడం కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో ఇప్పటికే 5 పశువులు మృతి చెందగా, మరో 10 పశువులకు వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా పశువులకి శరీరమంతా గడ్డలు రావడం…అవి పగిలిపోవడంతో పశువులు మృతి చెందుతున్నాయి. వింత వ్యాధితో పశువులు మృతి చెందడంతో పాడి రైతులు, చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.