వైమానిక ప్రదర్శన సందర్భంగా రిహార్సల్‌ చేస్తుండగా ఢీకొన్న విమానాలు

బెంగళూరు శివార్లలోని యలహంక ఎయిర్‌బేస్‌ ప్రాంగణంలో రెండు విమానాలు ఢీకొని కుప్పకూలాయి. వైమానిక ప్రదర్శన సందర్భంగా విమానాలు రిహార్సల్‌ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో ఓ పైలట్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. యలహంక వేదికగా బుధవారం నుంచి భారత వైమానిక దళం విమానాల ప్రదర్శన జరగనుంది. ఈ నెల 24వరకు సాగే ఈ ప్రదర్శన కోసం ఎయిర్‌ఫోర్స్‌ పైలట్లు నేడు రిహార్సల్‌ చేపట్టారు. ఐఏఎఫ్‌కు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్స్‌ బృందం రిహార్సల్‌ చేస్తుండగా రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. అయితే విమానాల్లో పైలట్లు మాత్రమే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *