ఏపి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం
ఆంద్రప్రదేశ్: ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలోనే శాసనసభలో ఎపి ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం పొందింది. విలీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనుంది. దీంతో 52 వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపబడనున్నారు. రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు దీనిపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.