జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం

విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి నలుగురువ్యక్తులు కారుతో బీభత్సం సృష్టించారు. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఓ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి అనంతరం ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడకు చెందిన నాగార్జున, హరీశ్‌, ప్రియాంక, మరో యువకుడు స్నేహితులు. వీరంతా గుంటూరు నుంచి విజయవాడ అతివేగంతో వెళుతూ అదుపుతప్పి హైవే పక్కనున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టారు. అనంతరం కారు ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు చెల్లాచెదురుగా కింద పడిపోయారు. నాగార్జున అనే యువకుడు మృతిచెందగా మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సెంటినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో వీరు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు నిర్ధరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *