డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత కుమారుడు
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు చాణక్య అరెస్ట్ అయ్యాడు. అతని దగ్గర నుంచి 824 మిల్లీ గ్రాముల 40 ఎల్ఎస్డీ డ్రగ్స్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. రానున్న న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చాణక్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా అతని స్నేహితులు డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు తీసుకొచ్చారు.. డ్రగ్స్ వెనక ఉన్నదెవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.