దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు

షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్‌ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుతో విచారణను వేగంగా పూర్తిచేసి దోషులకు కఠినశిక్ష విధించాలని ప్రభుత్వం తరఫున లా సెక్రటరీ సంతోష్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయనుంది. మహబూబనగర్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు సెషన్స్‌ జడ్జిని నియమిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *