పవన్‌కల్యాణ్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత

. అమరావతి:, రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం 33వేల ఎకరాలు సేకరించినప్పుడు భయమేసిందని.. కానీ ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతి రాజధానికి అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా జగన్‌ ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. అప్పుడే జగన్ గట్టిగా వ్యతిరేకించి ఉంటే.. రైతులు అన్ని భూములు ఇచ్చేవారు కాదని.. ఆయన మాట తప్పారని వ్యాఖ్యానించారు. అమరావతికి వ్యతిరేకమని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఎందుకు చెప్పలేదన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా… మందడం సమీపంలో పవన్‌కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించిన పోలీసులే .. కాన్వాయ్‌ ముందుకు వెళ్లకుండా తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక రైతులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు ,అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 200 మంది పోలీసులు కాన్వాయ్‌ ముందుకెళ్లకుండా చేయడంతో పవన్‌కళ్యాణ్ కారు దిగి కాలినడకన మందడం బయల్దేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్‌కళ్యాణ్ అభిమానులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *