భారత క్రికెటర్ కరుణ్ నాయర్ వివాహం జరిగింది
భారత క్రికెటర్ కరుణ్ నాయర్ తన స్నేహితురాలు సానియా తంకరివాలాను వివాహం చేసుకున్నాడు. రాజస్థాన్ ఉదయగిరిలో వీరి వివాహం జరిగింది. వివాహ వేడుకకు భారత క్రికెటర్లు యజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ ఆరోన్, శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే తదితరులు హాజరయ్యి, నూతన వధువరులను ఆశీర్వదించారు. తాజాగా వివాహానికి సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో క్రికెటర్లు షేర్ చేశారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారతీయునిగా కరుణ్ నాయర్ రికార్డులకెక్కాడు. 2016, డిసెంబర్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో తను ఈ ఘనత సాధించాడు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ట్రిపుల్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. అతని ఖాతాలో రెండు ట్రిపుల్ సెంచరీలు ఉండటం విశేషం. ట్రిపుల్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియాలో కరుణ్ నాయర్ చోటు సుస్థిరం కాలేదు. నిజానికి తర్వాతి టెస్టులోనే సెలెక్షన్ కారణాలతో తనను జట్టు నుంచి తప్పించారు. భారత్ తరపున చివరిసారిగా 2017లో తను బరిలోకి దిగాడు. ఆరు టెస్టులాడిన కరుణ్..374 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 303 నాటౌట్. ఇక రెండు వన్డేలాడిన కరుణ్.. 46 పరుగులు చేశాడు. రాజస్థాన్కు చెందిన కరుణ్.. కర్ణాటక తరపున క్రికెట్ ఆడతాడు.