మెగా వారి బంపర్ ఆఫర్ ఈ భామ కొట్టేసినట్టుంది..!
నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్స్ లో వేగంగా దూసుకొచ్చి నెంబర్ వన్ ప్లేస్ కు చేరిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో ఈ అమ్మడే ఇప్పుడు టాప్ హీరోయిన్ అంటే ఎలాంటి డౌటూ లేదు. అందం, అభినయం, అవసరమైతే సోకులు ఆరబోయడానికి కూడా సిద్ధం అవుతుండటం, అన్నింటికీ మించి ఈ జనరేషన్ అమ్మాయిలకు రిప్రజెంటేషన్ లా కనిపించడం రకుల్ కు ప్లస్ పాయింట్స్. అయితే ఈ భామ సక్సెస్ వెనుక మాత్రం మెగా క్యాంప్ కూడా ఉందనేది వాస్తవం. వరసగా మెగా అవకాశాలు అందిపుచ్చుకుని, హిట్స్ అందుకోవడంతోనే అగ్ర స్థానానికి సులువుగా వెళ్లగలిగింది. గతంలో కాజల్ కూడా మెగా క్యాంప్ ఇచ్చిన ఫుల్ సపోర్ట్ తో టాప్ ప్లేస్ కు చేరుకుంది.
మెగా క్యాంప్ లో ఒక హీరోతో అవకాశం వస్తే, ఇక వరసగా అందరితోనూ ఛాన్సులు వచ్చినట్టే అని సరదాగా ఫిల్మ్ జనాలు అంటుంటారు. ఆ మాట రకుల్ విషయంలో నిజమైనట్టు కనిపిస్తోంది. బ్రూస్ లీ, సరైనోడు, థృవ, విన్నర్ ఇలా మెగా క్యాంప్ లో భారీగానే సినిమాల్ని పట్టేసింది రకుల్. వీటిలో రామ్ చరణ్ తో థృవ, సాయి ధరమ్ తో విన్నర్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఇవే కాక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోయే వేదాళం రీమేక్ లో చేసే గోల్డెన్ ఛాన్స్ కూడా ఈ అమ్మడు కొట్టేసిందట. ఆర్టీ నీసన్ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ సినిమాకు రకుల్ కరెక్ట్ ఛాయిస్ అని మూవీ టీం భావిస్తున్నారని సమాచారం. అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎఎం రత్నం నిర్మించబోయే ఈ సినిమా 2017లో పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే మహేష్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న రకుల్, పవన్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ కొట్టేస్తే, ఇక ఈ అమ్మడికి టాలీవుడ్ లో తిరుగులేనట్టే..!