యాదాద్రి స్వామి శాంత మూర్తి
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిది ఉగ్ర రూపం కాదని.. ఆయన శాంత మూర్తేనని ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు స్పష్టం చేశారు. సింహానికి కోరలుండడం సహజమైన విషయమేనని తెలిపారు. అంతమాత్రాన స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నట్లు కాదని వివరించారు. మూల విరాట్టుకు ఉగ్రరూపం వచ్చేలా మూల విరాట్టుకు మార్పులు చేశారని వస్తున్న వాదనల నేపథ్యంలో ఆలయ ఉన్నతాధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వాదనలు పూర్తి అబద్ధమని కొట్టి పారేశారు. ఆగమ శాస్త్ర పరంగా ఎలాంటి తప్పూ జరగలేదని స్పష్టం చేశారు. ‘‘మన లక్ష్మీ నరసింహ స్వామివారు.. గొప్ప శక్తిమంతుడు. ఎన్నో యుగాల క్రితమే ఆవిర్భవించారు. కాలం గడుస్తున్న కొద్దీ మార్పులనేవి సహజమైనటువంటి విషయం. మనుషుల విషయంలోనూ మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నామా?’’ అని వ్యాఖ్యానించారు