హైదరాబాద్ రోటరీ మెగా రక్తదాన శిబిరాలు
రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 22.23 తేదీల్లో జంట నగరాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు కిరణ్పటేల్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోటరీ క్లబ్ గచ్చిబౌళి శాఖ అధ్యక్షురాలు శశికళ, భాగ్యనగర్ శాఖ అధ్యక్షులు శ్రీనిధి, నరే్షలతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. జంటనగరాల్లోని 14 ప్రాంతాల్లో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్ రెడ్క్రా్సకు అందజేస్తామన్నారు. 22న ది ప్లాజా హోటల్లో రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రమేశ్ వంగాల రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారన్నారు.