దోమ చెప్పిన పాక్ సీక్రెట్…
పాకిస్థాన్ అణు కార్యక్రమానికి చైనా సహాయం చేస్తోందని ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయి. పాక్ మాత్రం తాము సొంతంగా అణుకార్యక్రమాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకొస్తుంది. అయితే తాజాగా ఒక చిన్న దోమ పాక్ ఆరోపణలన్నిటిని కొట్టిపడేసింది. విషయానికి వస్తే ఇటీవల పాకిస్థాన్ లో దాదాపు 200 మండి చైనీయులు డెంగీ బారిన పడ్డారు. వీరంతా ఇంజనీర్లే కానీ వీరేమీ చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ లో పనిచేయడం లేదు. వీరంతా పాకిస్తానుకు చెందిన అణుశక్తి కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇటీవల చాలామంది అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు నిర్వహించగ వీరందరికి డెంగీ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని పాక్ పత్రిక డైయిలీ జంగ్ తెలిపింది. కానీ ఒక్క అనుకేంద్రంలోనే 200 మండి చైనా ఇంజనీర్లు డెంగీ బారినపడ్డారంటే అసలు అక్కడ ఎంతమంది చైనీయులు పనిచేస్తున్నారో అర్ధం అవుతుంది. దీనిని బట్టి పాక్ అణుకార్యక్రమానికి చైనా ఏ స్థాయిలో సహాయం చేస్తుందో చెప్పొచ్చు.