పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో 500 మినిమమ్ బ్యాలెన్స్
పోస్టాఫీస్ కస్టమర్లకు తాజాగా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్దారులకు షాకిచ్చింది. మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని పెంచింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా ఒక నోటిఫికేష్ జారీ చేసింది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు కచ్చితంగా వారి అకౌంట్లో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఇదివరకు మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి కేవలం రూ.50గా ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.500 చేశారు. రూపోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో.500 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే జరిమానా కింద రూ.100 కట్ చేసుకుంటామని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి పని దినం రోజున పెనాల్టీ డబ్బు కట్ అవుతుందని పేర్కొంది. రూ.50 మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి వల్ల ఇండియా పోస్ట్కు ఏడాదికి రూ.2,800 కోట్లు నష్టం కలుగుతోందని పేర్కొంది. ఒకవేళ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లో ఆర్థిక సంవత్సరం చివరి పని దినం రోజున జీరో బ్యాలెన్స్ ఉంటే.. అప్పుడు ఆ అకౌంట్ ఆటోమేటిక్గానే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా పోస్టాఫీస్ అకౌంట్ తెరవాలంటే రూ.500 చెల్లించాల్సిందే. కేవలం క్యాష్ రూపంలోనే అకౌంట్ను ఓపెన్ చేయగలం. అంతేకాకుండా పోస్టాఫీస్ అకౌంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక లావాదేవీ అయినా నమోదై ఉండాలి. అంటే డబ్బులు తీసుకోవడం లేదా డిపాజిట్ చేయడం చేయాలి. అప్పుడే అకౌంట్ పనిచేస్తుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ మొత్తానికి (ఏడాదిలో రూ.10,000 వరకు) ఎలాంటి పన్ను ఉండదు. మరోవైపు ఏపీ, తెలంగాణ పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ రిజల్ట్ వచ్చేసింది