7 పెళ్లిళ్లు, 20 మందిపై అత్యాచారం…
ఒక నకిలీ ఎస్సై ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని మోసం చేయడంతోపాటు మరో 20 మండి మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఎగ్మురుకు చెందిన యువతి ఈ ఏడాది జునా 30నా కనిపించకుండాపోయింది. దీనితో ఆమె తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ఆ యువతి పనిచేస్తున్న కంపెనీ ఎండి రాజేస్జ్ పృథ్వీ (29) ఆమెను అపహరించి బలవంతగా పెళ్లి చేసుకొని అతడి సొంత ఉరైన తిరుప్పూరు జిల్లా నొచ్చిపాలేయం బంధించాడు. దీనితో ఆమెను రక్షించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగ అతను పలుపేర్లతో పెద్ద చదువులు చదివినట్టు నమ్మించి అనేకమంది మహిళలను మోసం చేశాడని తేలింది. ఇప్పటికే ఆరుగురు యువతులను పెళ్లి చేసుకున్నా ఇతనిపై తమిళనాడు లోని తిరుచ్చి, క్యాంబత్తూర్, తిరుప్పూర్, ఏపీ లోని తిరుపతి, శ్రీకలహస్తి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఏదో పెళ్లి చేసుకోవడానికి ఎస్సై అవతారం ఎత్తాడు. ఇక్కడ 20మండి మహిళలను బెదిరించి అత్యాచారం చేశాడు. చివరిగా ఎగ్మురు యువతిని అపహరించి ఏడో పెళ్లి చేసుకున్నాడు.