ఢిల్లీఅసెంబ్లీ ఓట్ల లెక్కింపు లో 38 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వం ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అవడంతో ఎలక్ట్రానిక్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 38 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేదు.
ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ క్రేజీవాల్, ఆప్ శ్రేణులు తాము చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసుకున్నాయి. ఎన్నికలు ఏడాది సమయం ఉండగానే కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. ప్రతినెలా ఉచితంగా 20 వేల లీటర్ల నీటిని అందించారు. ఇవన్నీ ఢిల్లీ ప్రజల్లో ఆప్ సర్కారు పట్ల సానుకూలత ఏర్పడేలా చేశాయి. ప్రచారంలో ఎక్కడా జాతీయ అంశాలను ప్రస్తావించకుండా ఆప్ జాగ్రత్త పడింది.బీజేపీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రశాంత్ కిశోర్తో ఆయన ఒప్పందం చేసుకున్నారు. కేజ్రీవాల్ కోసం ఐప్యాక్ పని చేయడం కూడా ఆప్కి కలిసొచ్చింది. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం విషయంలో పీకే సేవలు కేజ్రీవాల్కు ఉపయోగపడ్డాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.అభివృద్ధి, సంక్షేమమే ప్రచారాస్త్రాలు కేజ్రీవాల్ విజయానికి కారణాలివే.