42 బాల్స్లోనే అఫ్రిది సెంచరీ
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చాలా రోజుల తర్వాత మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్కు ఇప్పటికే గుడ్బై చెప్పిన అఫ్రిది.. ఈసారి నాట్వెస్ట్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో చెలరేగిపోయాడు. డెర్బీషైర్తో జరిగిన మ్యాచ్లో హాంప్షైర్ తరఫున ఆడుతున్న అఫ్రిది.. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. విచిత్రంగా ఇప్పటివరకు మొత్తం 256 టీ20లు ఆడిన అఫ్రిదికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అతని ఇన్నింగ్స్లో 7 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో అతను ఓపెనర్గా వచ్చాడు. అతని దూకుడుతో హాంప్షైర్ 20 ఓవర్లలో ఏకంగా 249 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ను 101 రన్స్ తేడాతో గెలిచి ఆ టీమ్ సెమీస్లో అడుగుపెట్టింది.