ఎయిర్టెల్ స్మార్ట్ఫోన్ రూ.1399కే
జీయో దెబ్బకు మిగిలిన టెలికాం రంగ సంస్థలు కుదేలయ్యాయి. అయితే అ నష్టాన్ని భర్తీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ – కార్బన్ సంస్థ లు ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్ఫోన్’ ను విడుదల చేశాయి. కేవలం దీని ధర రూ.1399కే అందిస్తున్నట్లు ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు. జీయో తరహా ఎయిర్ టెల్ ప్రత్యేక మైన ప్యాక్ ను వినియోగదారులకు అందించనుంది. నెలకు రూ.169 రీఛార్జిపై అపరిమిత కాల్స్తో పాటు, రోజుకు 500 ఎంబీ డేటాను ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు పొందొచ్చు.ఆఫ్లైన్లో స్టోర్లలో ఈ ఫోన్లను అందుబాటులో ఉంచనున్నారు.