‘చిరు’కు జోడీగా విద్యాబాలన్ లేదా ఐశ్వర్యారాయ్..?
చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ విరామం తరువాత ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ మూవీ సక్సెస్తో ఇప్పుడు ఇంకో సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్న విషయం విదితమే. కాగా ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాంచరణ్ తేజ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే మెగాస్టార్ 151వ సినిమాకు ఉయ్యలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఇందులో చిరుకు జోడీగా ఓ బాలీవుడ్ నటిని చూపించాలని సురేందర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ నటీమణులైన ఐశ్వర్యారాయ్ బచ్చన్, విద్యాబాలన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.
ఐశ్వర్యారాయ్ లేదా విద్యాబాలన్లలో ఎవరో ఒకర్ని కచ్చితంగా చిరంజీవి సినిమాలో చూపించాలని చిత్ర యూనిట్ కూడా భావిస్తోంది. వారిద్దరిలో ఎవరైనా ఒకరు ఈ సినిమాలో కచ్చితంగా నటించేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ సక్రమంగా టైముకు జరిగితే ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాను రూ.125 కోట్ల బడ్జెట్తో తీయనున్నట్టు తెలిసింది.