అఖిల్‌ – శ్రీయా పెళ్లి ఆగిపోయిందా…!

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, జీవీకే రెడ్డి మనవరాలు శ్రీయాభూపాల్‌ పెళ్లి ఆగిపోయిందా? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇటీవలె  అఖిల్ నిశ్చితార్థం శ్రియాభూపాల్‌తో ఇటీవలే ఘనంగా జరిగింది. టాలీవుడ్‌లోని కొద్దిమంది ప్రముఖులతో పాటు పరిమిత సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, టాలీవుడ్‌లో వీరి పెళ్లి ఆగిపోయిందంటూ పెద్ద రూమర్ నడుస్తోంది.అయితే పెళ్లి ఎందుకు రద్దు అయిందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

అయితే అఖిల్, శ్రియాల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయని, వివాహం క్యాన్సిల్ కావడానికి ఇదే కారణమని కొందరు చెబుతున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అఖిల్, శ్రియాలతో మాట్లాడారని… అయినా ఫలితం లేకపోవడంతో, మ్యారేజ్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి మే నెలలో జరగాల్సి ఉంది. పెళ్లి నేపథ్యంలో, హోటళ్లు, రిసార్టులు బుక్ చేయడం కూడా జరిగింది. కానీ, ఇప్పుడు వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అవుతుందన్న వార్త  టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.దీనికి సంబంధించి, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

అఖిల్- శ్రియా నిశ్చితార్ధం ముగిసిన కొద్దిరోజులకు చైతూ-సమంత ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్-శ్రీయా పెళ్లి క్యాన్సల్‌ అయిందన్న వార్త ఇరు కుటుంబాల్లో కలకలం రేపుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *