అమితాబ్‌ ట్వీట్‌ ఎంత పనిచేసింది

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా క్యాన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆస్పత్రిలో ఉన్న ఫొటో ఒకటి బయటికి రావడంతో ఖన్నా ఆరోగ్య విషయం గురించి బాలీవుడ్‌లో ఆందోళనకరంగా మారింది.వినోద్‌ ఖన్నాకి క్యాన్సర్‌ అని వార్తలు వెలువడగానే బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ట్విటర్‌లో ఓ మెసేజ్‌ పెట్టారు. ‘మన కుటుంబీకులు, స్నేహితులుచనిపోయినప్పుడు మనమెంత కాలం బతుకుతామో అని ఆలోచిస్తుంటాం. చాలా విచిత్రంగా ఉంది కదా’ అని ట్వీట్‌ చేస్తూ తాను దిగాలుగా ఉన్న ఫొటో ఒకటి పోస్ట్‌ చేశారు.

వినోద్‌ ఖన్నా, అమితాబ్‌ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు. దీంతో అమితాబ్‌ పెట్టిన మెసేజ్‌ వైరల్‌గా మారింది. అది చూసి చాలా మంది వినోద్‌ ఖన్నా చనిపోయారనుకుని ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారట. ఆ తర్వాత వినోద్‌ ఖన్నా కుమారుడు రాహుల్‌ ఖన్నా తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని భయపడాల్సిన పనిలేదని మీడియా ద్వారా వెల్లడించడంతో అంతా కుదుటపడ్డారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *