తెలంగాణ యాత్రకు మంగళహారతి ఇచ్చి తిలకం దిద్దిన పవన్ కల్యాణ్ సతీమణి

ఎప్పుడూ లేనంత మెలోడ్రామా జనసేన కార్యాలయం వద్ద చేరుకుంది. రాజకీయాలకు సంబంధించినంత వరకూ తాను మాత్రమే ఇన్ వాల్వ్ అయి.. తన కుటుంబ సభ్యుల్ని ఏమాత్రం ఎంటర్ చేయని పవన్ కల్యాణ్..ఈసారి అందుకు భిన్నంగా తన తెలంగాణ టూర్కు తన సతీమణిని వెంటబెట్టుకురావటం ఆసక్తికరంగా మారింది.

పెళ్లి జరిగి ఇన్నేళ్లు అయినా.. పార్టీ స్టాపన ప్రకటన మొదలుకొని.. ఇప్పటివరకూ జరిగిన ఏ కార్యక్రమానికి ఇన్ వాల్వ్ చేయని తన సతీమణిని.. ఈసారి అందుకు భిన్నంగా తన వెంటపెట్టుకొని పార్టీ కార్యాలయానికి రావటం ఆసక్తికరంగా మారింది.

సతీమణి అన్నాతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్ దంపతుల్ని ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన అధినేతగా తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్న ఆయనకు తానే ఎదురొచ్చి హారతి ఇచ్చారు పవన్ సతీమణి.

గతంలో ఇంతవరకూ ఎప్పుడు చేయని విధంగా తన భార్య చేత వీర తిలకం దిద్దించుకున్నారు. అయితే.. వీర తిలకం ఎలా దిద్దాలో అన్నాకు చేతకాకపోవటంతో.. దాన్ని ఎలా పెట్టాలో భార్యకు నేర్పారు పవన్. కుడిచేతి ఉంగరం వేలితో తిలకం దిద్దాలని చెప్పటంతో.. ఆమె ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

ఆ సమయంలో కాస్త గంభీరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత నవ్వేశారు. భార్య చేత నుదిటిన తిలకం దిద్ది.. మంగళహారతి ఇప్పించుకోవటం.. తాను ప్రయాణించే కారుకు దిష్టి తీయటం.. తనకు ఎదురు రావటం లాంటి కార్యక్రమాలతో తన సతీమణికి తానిచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని పవన్ తన చేతలతో చెప్పకనే చెప్పేశారు. పవన్ వైవాహిక జీవితం మీద నేతలు తరచూ చేసే విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నంలో తాజాగా ఇలాంటివి చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా.. పవన్ తాజా తీరు ఆసక్తికరంగానే కాదు.. అనూహ్యంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *