రెవెన్యూ సిబ్బందిపై మరో రైతు దాడి

ఈ మధ్య జరిగిన తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యోదంతాన్ని ఎవరూ మరవక ముందే మరో ఘటన కనకయ్య అనే రైతు చిగురుమామిడి మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై పెట్రోలు పోశాడు. ఎంతో కాలంగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమి పట్టాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహించిన కనకయ్య కార్యాలయ సిబ్బందితోపాటు, అటెండర్‌పై కూడా పెట్రోలు చల్లాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా కార్యాలయ సిబ్బంది మాత్రం అన్నదమ్ముల మధ్య భూ వివాదం కారణంగానే పట్టాలు జారీ చేయలేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లగా, పెట్రోలు చల్లిన రైతుపై పోలీసులకి ఫిర్యాదు చేసి, క్రిమినల్‌ కేసు నమోదు అయ్యేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు .

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *