మరో దారుణ ఘటన అమాయకంగా నమ్మి వెళ్లిన బాలికను

తెలంగాణలో  మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికను రేప్ చేసి ఆపై ఉరితీసి చంపేశారు కిరాతకులు. గద్వాల్ జిల్లా మల్డకల్ మండలం నేతివానిపల్లిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
రాత్రి బాలికను పొలాల్లోకి రమ్మని ఆగంతకుడు ఫోన్ చేశాడు. వాడి మాటల్ని అమాయకంగా నమ్మి వెళ్లిన బాలికను అక్కడే అత్యాచారం చేశారు. ఆపై అమ్మాయిని ఉరివేసి హతమార్చారు. దీంతో ఈ ఘటనపై గ్రామంలో జనం భగ్గుమంటున్నారు. నిందితుల్ని ఒక్కరోజులో పట్టుకోకపోతే అని  పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్రామ ప్రజలకు దొరికితే గనుక గద్వాల్ జిల్లాలో సోమనాద్రి సాక్షిగా నడి రోడ్డు మీద చంపేస్తామని పోలీసులకు సవాలు విసురుతున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *