ముఖ్యమంత్రినే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు!

ఈటా న‌గ‌ర్‌ ‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి మరోసారి తెరమీదకు వచ్చింది. అధికార ప్రాంతీయ పార్టీ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌(పీపీపీ) స్వయంగా తమ ముఖ్యమంత్రి పెమాఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీనుంచి సస్పెండ్‌ చేసింది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారంటూ వారిపై వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఖండూ ఇక ఎంతమాత్రమూ శాసనసభాపక్ష నేత కాదని.. అతనికి ఇక ఏ అధికారాలూ ఉండబోవని పార్టీ అధ్యక్షుడు క‌హ‌ఫా బెంజియా ప్రకటించారు. పార్టీ సభ్యులెవరూ ఆయన నిర్వహించే సమావేశాలకు హాజరుకావొద్దని నేతలను హెచ్చరించారు. దీన్ని ఉల్లఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సైతం వెనకాడబోమన్నారు. త్వరలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటామని వెల్లడించారు.

ఖండూ స్థానంలో మరో నేత తకమ్‌ పరియోను ఎన్నుకోనున్నట్లు సమాచారం. సభాపతి, గవర్నర్‌లకు ఈ విషయంపై పార్టీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో పెమా ఖండూతో పాటు మరో 42 మంది కాంగ్రెస్‌ రెబల్స్‌ పీపీఏలో చేరిన సంగతి తెలిసిందే.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *