వైరల్‌గా మారిన అత్తా మేనకోడలి ఫొటో

ఇటీవల ఐశ్వర్యరాయ్‌ కుటుంబం ముంబయిలో జరిగిన ‘వోగ్‌’ బ్యూటీ అవార్డ్స్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిషేక్‌ బచ్చన్‌ తప్ప ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేశారు. కానీ ఈవెంట్‌లో కుటుంబం మొత్తంలో ఐశ్వర్యరాయ్‌.. అమితాబ్‌ పెద్ద మనవరాలు నవ్య నవేలీ నందలు హైలైట్‌గా నిలిచారు.

ఎప్పటిలాగే ఐశ్వర్య రాయ్‌ తన దుస్తులు, అలంకరణతో వీక్షకులను కట్టిపడేసింది. ఈసారి నవ్య కూడా తన మేనత్తకి ఏమాత్రం తగ్గకుండా స్కైబ్లూ రంగు గౌనులో మెరిసిపోయింది. సాధారణంగా నవ్యా బయట జరిగే ఈవెంట్లకు హాజరుకాదు. ఈసారి తన కుటుంబం మొత్తం వెళ్తొంది కాబట్టి ఆమె కూడా వారితో కలిసి ఈవెంట్‌లో మెరిసిందట.

అయితే ఈవెంట్‌లో నవ్య తన మేనత్త ఐశ్వర్య పక్కన కూర్చుని మాట్లాడుతున్న ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దాంతో ఈఫొటో కాస్తా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ ఫొటోకి తెగ లైక్‌లు కామెంట్లు ఇచ్చేస్తున్నారు. వీరిద్దరినీ చూస్తుంటే మేనత్త మేనకోడళ్లగా కాకుండా అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తున్నారని, ఇప్పటికీ ఐశ్వర్య రాయ్‌ అందం ఇసుమంతైనా తగ్గలేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *