దక్షిణాఫ్రికా సిరీస్ కు టి20 జట్టు ఇదే…

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు ఖరారైంది. సెప్టెంబరు 15, 18, 22 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో ఎంఎస్‌ ధోనీకి సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. మరోవైపు ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫాస్ట్‌ బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌కు టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లైన ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైని.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *