కార్తిక్ కు బిసిసిఐ నోటీసులు జారీ
భారత క్రికెటర్ దినేష్ కార్తిక్ కు బిసిసిఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కరేబియన్ ప్రియర్ లీగ్ (సిసియల్)లో త్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నందుకు అతనికి నోటీసులు జారీ చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సెయింట్ కిట్స్ తో జరిగిన తొలి మ్యాచుకు కార్తిక్ హాజరయ్యాడు. త్రిన్ బాగో జెర్సీ ధరించి డ్రెస్సింగ్ రం లో కనిపించాడు. దీంతో క్రమ శిక్షణ ఉల్లంఘన చర్యల కింద కార్తిక్ కు బిసిసిఐ నోటీస్ పంపించింది. బిసిసిఐ నిబంధనల ప్రకారం ఫాస్ట్ క్లాస్ క్రికెటర్ ఐపిఎల్ లో తప్ప మరి ఏ ఇతర లిగుల్లో ఆడేందుకు అనుమతి లేదు. దీనితో బిసిసిఐ కార్తిక్ నోటీసులు జారీ చేసింది.