కేటీఆర్‌ సీఎం కావాలని …

 ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని పార్టీకి చెందిన పలువురు నేతలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రులు కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌ను సీఎం చేయాలంటూ టీఆర్ఎస్ యువనేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి కుమారుడు ప్రశాంత్ సోమవారం (ఫిబ్రవరి 3) మేడారంలో సమ్మక్క సారలమ్మను మొక్కుకున్నారు. ఆయనతో పాటు వెయ్యి మంది యువకులు ర్యాలీగా మేడారం చేరుకొని వనదేవతల గద్దెల వద్ద మొక్కు చెల్లించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన సుమారు 15 గ్రామాలకు చెందిన యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు కేటీఆర్‌ ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఏకతాటిపై నడిపించి ఘన విజయాన్ని సాధించి పట్టారని సిరికొండ ప్రశాంత్‌ కొనియాడారు. పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపించగలిగే సత్తా ఆయనకు ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రపంచదేశాలలోని పారిశ్రామికవేత్తలతో సంబంధాలు కలిగి ఉండటం కేటీఆర్‌కు అదనపు బలం అని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *