బిగ్ బాస్-3 హౌస్ లో దొంగల ముఠా

బిగ్ బాస్-3 45వ ఎపిసోడ్ లో శిల్పా చక్రవర్తి బాబా భాస్కర్ గారిని గేమ్ గురించి అడిగి తెలుసుకోవడంతో మొదలయ్యింది. తనకు ఇప్పుడు రావడం పెద్ద టాస్క్ అన్న శిల్పాతో వారం గమనించి వెళ్లిపోవచ్చు అని బాబా అనడంతో శిల్పా బాబా భాస్కర్ మీద ఫైర్ అయ్యింది. ఇక రాహుల్, పునర్నవి శ్రీముఖి గురించి మాట్లాడరు. తనకు శ్రీముఖి కి పడట్లేదాని రాహుల్ అంటాడు. ఇక శ్రీముఖికి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన శిల్పాకి పడదని పున్ను అంటుంది. దీనికి రాహుల్ నువ్వు ఊహించుకొని శిల్పా బ్యాడ్ అనుకోకు అనడంతో పునర్నవి రాహుల్ మీద ఫైర్ అయ్యింది.

ఇక ఈ వారం టాస్క్ లో భాగంగా దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చారు. దొంగలు ముఠా, నగర వాసులు అని కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టారు. దొంగలకు రాణిగా శిల్పాను పెట్టారు బిగ్ బాస్. దొంగల ముఠాగా రవి, రాహుల్,వరుణ్,పునర్నవి,శివజ్యోతి. వీళ్ళంతా మాస్క్ లు తగిలించుకొని బిగ్ బాస్ ఇంట్లోని వస్తువులను దొంగలించారు. ఈ టాస్క్ లో భాగంగా అందరూ కొట్టుకున్నారు. స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో అయితే అందరూ విచక్షణ లేకుండా మరి బలప్రయోగం చేశారు. రాహుల్, అలీలు ఒకర్నొకరు గెంటుకుని కొట్టుకోకా.. శ్రీముఖి, పునర్నవిలు కొట్టుకున్నంత పనిచేశారు. ఇక వితికా, వరుణ్ లు మరోసారి దూషించుకున్నారు. ఈ టాస్క్ రేపటికి కూడా ఉండడంతో ఏం జరుగుతుందో చూడాలి…

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *