టీమ్ ఇండియా జెర్సీపై నుండి ఒప్పో మాయం
టీమ్ ఇండియా ఆటగాళ్లు ధరించే బ్లూ జెర్సీపై ఇంతకాలం కనిపించిన మొబైల్ సంస్థ ఒప్పో బ్రాండ్ త్వరలో కనుమరుగవనుంది.2017 మార్చిలో టీమిండియా జెర్సీపై బ్రాండ్ హక్కులను ఒప్పో సంస్థ ఐదు సంవత్సరాలకు రూ. 1,079 కోట్లకు దక్కించుకుంది. అయితే ఇంకా రెండళ్లకు పైగా ఒప్పందం ఉన్నప్పటికీ ఒప్పో ముందుగానే తప్పుకుంటున్నట్లు సమాచారం . 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇంత మొత్తాన్ని చెల్లించడం తలకు మించిన భారంగా ఉండటంతో ఒప్పో తప్పుకోవాలని చూస్తోందట. దాంతో బెంగళూరుకు చెందిన ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ ఈ హక్కులను ఒప్పో నుంచి అంతే ధరకు సొంతం చేసుకుంది. ఈ సెప్టెంబర్ నుంచి 2022 మార్చి వరకు బైజుస్ ఒప్పందం కుదుర్చుకుంది.