చిదంబరం అరెస్టు..

chiఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరంను అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను కొందరు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే మొదటి రౌండ్‌ పూర్తయింది. రెండో రౌండ్‌ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ఇంద్రాణీ ముఖర్జీ పాత్రపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం ఆయన రిమాండ్‌కు సీబీఐ విజ్ఞప్తి చేయనుంది. అయితే ఆయన అరెస్టు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేగింది. ఈ వ్యవహారంలో తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్‌ (టీఎన్‌సీసీ)తోపాటు మిత్రపక్షమైన డీఎంకే కూడా చిదరంబానికి బాసటగా నిలిచింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విమర్శించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు వ్యవహారంలో చిదంబరానికి సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసు జారీచేయడాన్ని స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *