అక్కడ 7 సంవత్సరాలకు అన్నీ రకాల పన్ను మినహాయింపు

జమ్ము కాశ్మీర్ రాష్ట్ర విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పోగేట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నిబహుముఖ కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఏడు సంవత్సరాలకు జి‌ఎస్‌టి తో సహ అన్నీ రకాల పాన్నులకు మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీని కోసం 11 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ద్వారా ఒక దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. లద్దఖ్ కు కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనుండి.

ప్రతి గ్రామానికి కనీసం అయిదు ప్రభుర్వ ఉద్యోగాలు కల్పించాలన్నది ఈ ప్రణాళికలో ప్రధాన లక్ష్యం. స్థానిక యువతతోనే ఒక సి‌ఆర్‌పి‌ఎఫ్, ఒక బి‌ఎస్‌ఎఫ్ బెటాలియన్ల ఏర్పాటు. విద్యుత్ చార్జీల తగ్గింపు. కార్పొరేట్, విద్యా సంస్థల ఏర్పాటు. 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్యా. ఉద్యోగులకు కొత్త జీతభత్యాలు. 5 వరకు ప్రభుత్వ రంగా సంస్థల ఏర్పాటు. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు పొందుతున్న సౌకర్యాలన్నీ ఇక్కడ వర్తింపు. పెట్టుబడుల సదస్సు నిర్వహణ. సాహస, అధ్యాత్మిక, పర్యాటక ప్యాకేజీల అమలు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *