త్వరలో కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం త్వరలో ప్రజలపై భారం మోపేలా మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది.ఎవరైనా వాహనాన్ని అక్రమంగా రోడ్డుపై పార్కింగ్ చేస్తే వారినుంచి వెయ్యిరూపాయల జరిమానాను వసూలు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్థుతం అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేసిన వారి నుంచి రూ200 లు జరిమానాను వసూలు చేస్తుండగా దాన్ని వెయ్యిరూపాయలకు పెంచనున్నారు. స్మార్ట్ నాగ్ పూర్ సిటీ సదస్సులో కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడుతూ అక్రమంగా వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేయకుండా నివారించేందుకు జరిమానాల పెంపు విధానాన్ని తీసుకురానున్నామన్నారు. రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేస్తే ఎవరైనా దాన్ని క్లిక్ మనిపించి ట్రాఫిక్ పోలీసు, రవాణాశాఖకు పంపించవచ్చునన్నారు. రోడ్లు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకుండా భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని గడ్కరీ కోరారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *