షా తిన్నది దళిత భోజనం కాదు- సీఎం కేసీఆర్
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని సీఎం కేసీఆర్ ఉతికి ఆరేశారు. దళితులపై ప్రేమ చూపిస్తున్న షా, అక్కడ భోజనం తిన్నట్లు నటించారని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో దళితులతో కలిసి షా తిన్న భోజనం దళితవాడలో వండినది కాదని, మనోహర్రెడ్డి అనే వ్యక్తి తోటలో తయారు చేసిందన్నారు. ఈ విషయం తెలియగానే తేరాట్పల్లి దళితులు ఖండించారని అన్నారు. దళితులవాడలో అమిత్ షా నిద్రపోలేదని, అగ్రకులాల ఇళ్లలో బస చేసి, అక్కడే వండిన ఆహారం తింటూ దళితులను మోసం చేశారు.
సహపంక్తి భోజనాల పేరుతో సోపాలు, టేబుళ్ల మీద కూర్చొని మాట్లాడితే అయిపోతుందా అని ప్రశ్నించారు. దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చామని కేసీఆర్ చెబుతూనే, దళితుల అభివృద్ధికి కేంద్రం ఖర్చు చేసింది రూ. 52,393 కోట్లు కాగా, ఒక్క తెలంగాణ ప్రభుత్వం రూ.14, 375 కోట్లు కేటాయించిందన్నారు. అదికాకుండా ఎస్టీల సంక్షేమం కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.