సీఎం కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు
ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరం, జలుబు, దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి వెళ్లారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. కొన్ని టెస్టులు నిర్వహించిన యశోద ఆస్పత్రి వైద్యులు సాధారణ జ్వరమేనని చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు సూచించారు. వైద్య పరీక్షల అనంతరం సీఎం ప్రగతి భవన్కు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా యశోద ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయమే ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం.