27న విజయవాడకు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 27న సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని సీఎం మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం తెలంగాణ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్.. భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల వెంకన్నకు స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించిన విషయం విదితమే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *