మందు కిక్కులో కానిస్టేబుల్
హైదరాబాద్లో ఫలక్నామ పోలీస్ స్టేషన్లో ఈశ్వరయ్య కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. మద్యం మత్తులో నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. . సోమవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించిన కానిస్టేబుల్ గోశాల రోడ్డులో వీరంగం సృష్టించాడు. మందు కిక్కులో నడిరోడ్డుపై తూలి పడిపోయాడు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కానిస్టేబుల్ను చూసి జనాలు సైతం షాకయ్యారు. ఈశ్వరయ్య మద్యం మత్తులో.. ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కానిస్టేబుల్ను పక్కకు జరగాలని వాహనదారులు కోరగా వాళ్లపైనా చిందులు తొక్కాడు. ఈలోగా ఓ వాహనదారుడు కానిస్టేబుల్ వీరంగం మొత్తాన్ని తన మొబైల్లో రికార్డ్ చేశాడు. తర్వాత మెల్లిగా ఈశ్వరయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం పోలీస్శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మద్యం తాగి మత్తులో వీరంగం సృష్టించిన కానిస్టేబుల్ ఈశ్వరయ్యపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కానిస్టేబుల్ వ్యవహారాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీఐకు సీపీ అంజనీకుమార్ మెమో ఇచ్చారు.