కరోనావైరస్‌ను ‘కొవిడ్‌-19’గా పేరును మార్చారు.

చైనాను నిలువునా వణికిస్తూ ప్రపంచానికి వ్యాపిస్తున్న  కరోనా,వైరస్‌ను ‘కొవిడ్‌-19’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేరును మార్చారు.  డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానమ్‌ గెబ్రెయెసిస్‌ ప్రకటించారు. కరోనా, వైరస్‌, డిసీస్‌ ఇంగ్లిష్‌ పదాల్లోని తొలి రెండు అక్షరాలను తీసుకుని ‘కొవిడ్‌-19’గా పేరు పెట్టినట్లు తెలిపారు. కరోనా 2019 డిసెంబరు 31న వెలుగులోకి వచ్చింది. కాగా.. చైనాలో ఈ వైరస్‌ కారణంగా మరణాల సంఖ్య 1,016కు చేరింది. ఒక్క సోమవారమే 108 మంది మృతి చెందినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. వీటిలో 103 మరణాలు.. వైరస్‌ జన్మస్థానమైన వూహాన్‌ నగరం ఉన్న హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే చోటుచేసుకున్నాయి. మంగళవారంతో 42,638 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. చైనా అధికారులకు సహకరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం సోమవారం రాత్రి బీజింగ్‌ చేరుకుంది. వీరు స్థానిక వైద్య నిపుణులతో బృందంగా ఏర్పడి విస్తృత పరిశోధనలు సాగించనున్నారు. జ్వర లక్షణాలున్నవారు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాల్లోనే పరీక్షలు చేయించుకోవాలని వూహాన్‌ వాసులకు అధికారులు సూచిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *