వరుణ్ తేజ్ వాల్మీకి కి కోర్ట్ నోటీసులు

మెగా హీరో  వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి వరుసగా సినిమాను సమస్యలు వెంటాడుతున్నాయి. ఈసినిమా టైటిల్‌ ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్‌ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా టైటిల్‌ తమను కించపరిచే విధంగా ఉందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్‌ బోర్డు, ఫిలిం ఛాంబర్‌లతో పాటు హీరో వరుణ్‌ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన  వాల్మీకి సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రతినాయక ఛాయలున్న పాత్రలో వరుణ్ తేజ్‌ నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *