డీజేలో ఎన్‌టీఆర్, ఏఎన్నాఆర్‌కు అవమానమా?..కమ్మ అంటూ మరో వివాదం..

ఈ సినిమాలో కమ్మ కులంపై డైరెక్ట్‌గా డైలాగ్స్ చెప్పించడంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది. ఓ వర్గం అభిమానులు దర్శక నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఓ పాటలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌లను అవమానించే రీతిలో చిత్రీకరించారనే వాదన కూడా వెలుగులోకి వచ్చింది.

దువ్వాడ జగన్నాథం చిత్రంలో పెళ్లికి సంబంధించిన ఓ సీన్ ఉంటుంది. ఆ పెళ్లికి సంబంధించిన వంటలను బ్రహ్మణులు (అల్లు అర్జున్) నడిపే అన్నపూర్ణ క్యాటరింగ్‌కు ఇస్తారు. అయితే పులిహోరలో ఇంగువ వద్దని పెళ్లి వారు గోల చేస్తున్నారని చెప్పగా.. ఇంగువ లేకపోతే పులిహోర టేస్టే ఉండదు అని అల్లు అర్జున్ అంటాడు. పెళ్లి వాళ్లను ఒప్పించడానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ కాల్ రిసీవ్ చేసిన

దువ్వాడ జగన్నాథం చిత్రంలో పెళ్లికి సంబంధించిన ఓ సీన్ ఉంటుంది. ఆ పెళ్లికి సంబంధించిన వంటలను బ్రహ్మణులు (అల్లు అర్జున్) నడిపే అన్నపూర్ణ క్యాటరింగ్‌కు ఇస్తారు. అయితే పులిహోరలో ఇంగువ వద్దని పెళ్లి వారు గోల చేస్తున్నారని చెప్పగా.. ఇంగువ లేకపోతే పులిహోర టేస్టే ఉండదు అని అల్లు అర్జున్ అంటాడు. పెళ్లి వాళ్లను ఒప్పించడానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ కాల్ రిసీవ్ చేసిన పాత్రధారి (ఝాన్సీ) మాట్లాడుతుంది.

మా ఇంట్లో పెళ్లి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మాది కమ్మ కులం, వాళ్లది వేరే కులం. మాకు ఇంగువతో కూడిన భోజనం ఇష్టపడటం లేదు అని అంటుంది. బ్రహ్మణు పిల్లను చేసుకొంటున్నారు. బ్రహ్మణుల చేత వంట చేయిస్తున్నారు. బ్రహ్మణ వంట తినకపోతే బాగుండదు అని నచ్చచెప్తారు. మాటల్లో భాగంగా బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు అని అర్జున్ సెటైర్ వేస్తాడు. కమ్మవారి ఇంట్లో ఆడవాళ్లదే డామినేషన్.. మీరు చెప్తే అందరూ వింటారు అనే విధంగా స్టైలిష్ స్టార్ చెప్తాడు. దాంతో సరైనని ఝాన్సీ అంటుంది.

అయితే కమ్మ కులం అనే పదాన్ని డైరెక్ట్‌గా వాడటంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కమ్మ కులంలో ఆడవాళ్ల డామినేషన్ నడుస్తుంది అని లేవనెత్తిన పాయింట్ కొందరికి మింగుడుపడటం లేదు. తమ కులంపై అలా బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 అలాగే దువ్వాడ జగన్నాథం చిత్రానికి సిటీ మార్ పాట హైలెట్‌గా నిలించింది. ఆ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డే దుమ్ము రేపారు. పాటకు ఈలలతో థియేటర్ దద్దరిల్లింది. ఆ పాటలో భాగంగా ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, మెగాస్టార్ అంటూ ముగ్గురు హీరోలను ఆకాశానికి ఎత్తాడు దర్శకుడు. కానీ పాటలో మహానటులను చూపిన విధానంపై కూడా ఓ వర్గం అభ్యంతరాలను లేవనెత్తుతున్నది

సీటీ మార్ పాటలో ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ అంటూ అల్లు అర్జున్ అంటుండగా బ్యాక్ గ్రౌండ్‌లో ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు ప్రత్యక్షమవుతాయి. అక్కడే నందమూరి, అక్కినేని అభిమానులు ఇందేంటని ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్‌ను మధ్యలో పెద్దగా హైలెట్ చేస్తూ.. మహానటుల ఫొటోలను పక్కకు పడేశారు అని మండిపడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *