కేటీఆర్ ను ఫిదా చేసే కామెంట్ చేసిన మంచులక్ష్మీ!
డ్రగ్స్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్పై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.సినీ పరిశ్రమకు సంబంధించిన అంశమే అయినప్పటికీ హైదరాబాద్ ను ఓ కుదుపు కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ పై మంచు వారి అమ్మాయి మామూలు కామెంట్ చేయలేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వారసుడు కేటీఆర్ కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ ట్వీట్ పైనా మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. “దిగ్విజయ్… విచక్షణ కోల్పోయారు. వారు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వయస్సుకు తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు.
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. ఈ సంవాదంలోకి వచ్చిన మంచు లక్ష్మీ ప్రసన్న..“రామ్..సరిగ్గా చెప్పారు. ఆయన (దిగ్విజయ్ సింగ్) విచక్షణను ఎప్పుడో కోల్పోయారు“ అంటూ రీట్వీట్ చేశారు.
మంచు లక్ష్మీ ట్వీట్కు కొందరు వివిధ రకాలుగా స్పందించారు. ‘మనకెందుకు అక్కా.. ఇక్కడి విషయాలు, మన ప్రెసిడెంట్ ట్రంప్ కదా’ అని ఒకరు, ‘మేడమ్ మీ పైన నాకు గౌరవం ఉంది. నీకు పాలిటిక్స్లో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్పా. కానీ ఇలాంటి పిచ్చిపిచ్చి ట్వీట్స్ చేయకండి’ అని ఇంకొకరు పేర్కొన్నారు.