పుట్టింటికి చేరిన క్రికెట్ ప్రపంచకప్
క్రికెట్ ప్రపంచ కప్ పోటీలో భారత్ వెనుదిరిగినప్పటికీ.. విశ్వ విజేతగా నిలిచే దేశం ఏదవుతుందనే.. ఉత్కంఠ ఏమాత్రం తగ్గలేదు, ఇంగ్లండ్ న్యూజిలాండ్ జట్టుల మధ్య జరిగిన ఫైనల్స్ లో.. ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 50 ఓవర్లలో 241 పరుగులు చేసి 8 వికెట్లు పోగొట్టుకుంటే.. 242 పరుగులు టార్గెట్ గా ఉన్న ఇంగ్లాండ్ కూడా 241 పరుగులే.. తీయటంతో మొదట మ్యాచ్ డ్రా అయ్యింది.
దీంతో విశ్వ విజేతలు ఎవరనేది తేల్చేందుకు సూపర్ ఓవర్ ను ఇవ్వటం జరిగింది, కానీ.. విచిత్రం ఏంటంటే.. సూపర్ ఓవర్ కూడా.. డ్రా అయ్యింది, కాకపోతే.. ఇన్నింగ్స్ లో ఎక్కువ బౌండరీస్ కొట్టిన జట్టుకే విజయం దక్కుతుందన్న నిబంధన ప్రకారం ఇంగ్లాండు జట్టుకే.. 2019 ప్రపంచ క్రికెట్ కప్పు సొంతం అయ్యింది.
క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లాండు ఇప్పటివరకూ.. మూడు సార్లు ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్ళినా.. ఒక్కసారి కూడా కప్పు గెలుచుకోకపోవటం, ఈ సారి ఆ కల సాకారమవ్వటంతో… మొట్టమొదటి విజయం అందినందుకు అటు జట్టు, ఇటు అభిమానుల సంతోషం కట్టలు తెంచుకుంది.
మొత్తానికి ఈ గెలుపుతో ఇంగ్లాండుకు వరల్డ్ కప్ గెలుచుకోలేదన్న లోటు తీరిపోయింది. సూపర్ ఓవర్ సూపర్ గా కలిసొచ్చిందన్నమాట.