కడుపున పుట్టిన కూతుళ్లనే రేప్ చేసిన తండ్రి…

న్యూఢిల్లీ: కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామంతో వారిని కాటేశాడు. ఏకంగా ఏడాది కాలంగా వారిపై తన కామ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. తండ్రి దుర్మార్గం ముందు నిస్సహాయులుగా మారిపోయిన ఆ కూతుళ్ల పరిస్థితిపై.. ఎట్టకేలకు పొరుగువారు ధైర్యం చేసి మహిళా కమిషన్ ను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలో ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఏడుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తాగడం, పేకాట ఆడటం ఈ రెండూ అతనికి వ్యసనాలుగా మారాయి. క్రమంలో పీకలదాకా మద్యం సేవించి ఇంటికి రావడం అలవాటుగా మార్చుకున్నాడు. అలా వారిపై నిత్యం అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. అతగాడి దుర్మర్గానికి అడ్డుపడితే భార్యను సైతం చితకబాదేవాడు. అయితే వీరి నిస్సహాయ స్థితిని గమనించిన పొరుగువారు.. మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా కమిషన్ కౌన్సెలర్లు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం బాలికలను ప్రభుత్వ షెల్టర్ కు తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్కో376 కింద అతనిపై కేసు నమోదు చేశారు. కాగా, అత్యాచారం విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని తండ్రి తమను బెదిరించినట్టుగా బాలికలు ఆవేదన చెందుతూ చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *