బిగ్ ఫ్రీడం సేల్కు తెరతీసిన ఫ్లిప్కార్ట్.. మొబైల్స్పై ఆఫర్లే ఆఫర్లు!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన తర్వాతి ‘గ్రేట్ ఇండియన్ సేల్’ తేదీలను ప్రకటించిన కొన్ని రోజులకే మరో దిగ్గజం ప్లిప్కార్ట్ ‘బిగ్ ఫ్రీడం సేల్’ తేదీలను విడుదల చేసింది. ఆగస్టు 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సేల్లో మొబైల్స్, టీవీలు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, హెడ్ఫోన్లు, కెమెరాలు, ఇతర యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ రాయితీలతోపాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేసే వారికి అదనంగా మరికొన్ని రాయితీలు ప్రకటించింది.
బిగ్ ఫ్రీడం సేల్లో భాగంగా మోటో ఎం, మోటో జీ5 ప్లస్, లెనోవో కే5 నోట్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్, ఐఫోన్ 32 జీబీ వేరియంట్లపై భారీ రాయితీలు ఉన్నాయి. అలాగే మూడు రోజులూ రెడ్మీ నోట్ 4 అమ్మకాలు జరగనున్నాయి. అలాగే ల్యాప్టాప్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపైనా భారీ రాయితీలు ప్రకటించింది. స్మార్ట్వాచ్లపై 50 శాతం తగ్గింపు ప్రకటించింది. కాగా, అమెజాన్ కూడా ఆగస్టు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ వరకు ‘గ్రేట్ ఇండియన్ సేల్’ నిర్వహించనుంది.