ఎడ్లబండికి చలానా…రూ.1000…
కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు చివరకు ఎద్దుల బండిని కూడా వదలడం లేదు. విషయానికి వస్తే తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఓ ఎడ్ల బండి యజమానికి రూ.1000 జరిమానా విధించారు. డెహ్రాడూన్ శివారులోని సహాస్ పూర్ లో రియాజ్ హాసన్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రం వద్ద శనివారం ఎద్దులబండిని నిలిపి ఉంచాడు. దీనితో పోలీసులు హాసన్ ఇంటికి వెళ్ళి అతనికి రూ.100 చలానా అందజేశారు. దీనితో అతను ఎడ్లబండి మోటారు వాహనాల చట్టం క్లిండ ఎలా వస్తుందని ప్రశ్నించాడు. దీనితో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో చలానా రాశామని చెప్పి చలానా రద్దు చేశారు. ఇందులో అతని తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు.