26 ఏళ్ళుగా ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీలు

26 ఏళ్ళుగా ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహించడంపై ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను డీ సీఎం అశ్వత్థనారాయణ అభినందించారు. ఆదివారం మల్లేశ్వరం నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రోగులను ఆయన పరామర్శించారు. కర్ణాటకతోపాటు పొరుగు రాష్ట్రాలనుం చి 150మందికిపైగా రోగులు శిబిరంలో పాల్గొన్నారు. సోమవారం నుంచి ఈనెల 12వరకు జర్మనీకి చెందిన 9మంది వైద్యులబృందంచే ప్లాస్టిక్‌ సర్జరీలు జరుపుతారు. ప్ర ముఖ వైద్యులు నారాయణ, సోలంకితోపాటు ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. వివరాలకు 98803 07780కు సంప్రదించవచ్చునన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *