ద్రావిడ్ కు గంగూలీ మద్దతు
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్కు బీసీసీఐ అంబుడ్స్మన్ నోటీసులు ఇవ్వడంపై భారత్ మాజీ కెప్టెన్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వార్తల్లో నిలవడానికే నోటీసులు ఇచ్చారని.. భారత క్రికెట్ను దేవుడే కాపాడాలని ట్విటర్లో పేర్కొన్నాడు. ‘భారత క్రికెట్లో ఇదో కొత్త ఫ్యాషన్. విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం. భగవంతుడే భారత క్రికెట్ను కాపాడాలి. బీసీసీఐ అంబుడ్స్మన్ ద్రవిడ్కు నోటీసులు ఇచ్చారు.’ అని ట్వీట్ చేశాడు.
దీనికి భారత బౌలర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ గంగూలీ ట్వీట్కు మద్దతు తెలిపాడు. భారత క్రికెట్లో ద్రవిడ్కు మించిన మరో అత్యుత్తమ క్రికెటర్ లేడని, అలాంటి లెజెండ్కు నోటీసులు ఇవ్వడం అవమానకరం అని మండిపడ్డారు. ప్రస్తుతం ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్గా కొనసాగుతున్నాడు. అయితే ఇండియా సిమెంట్స్ సంస్థలో వైస్ఛైర్మన్గా అతను ఉండటంతో విరుద్ధ ప్రయోజనాల అంశంగా బీసీసీఐ అంబుడ్స్మన్ డీకే జైన్ నోటీసులు ఇచ్చారు. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ద్రవిడ్ను ఆదేశించారు.